
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఎల్పీజీ నిల్వలు, మళ్లింపు కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీ స్థాయిలో సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో వేలాది సిలిండర్లు పట్టుబడగా,వాటి విలువ 1.10కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. గృహ వినియోగానికి సంబంధించిన మొత్తం 3,699 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి 70 చిన్న ఎల్పీ సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సిలెండర్ల విలువ 1.10 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. అక్రమ కార్యా లపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ అధికారులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
ఎల్పీజీ సబ్సిడీ దుర్వినియోగం, గృహ అవసరాలకు మళ్లించడం వంటి అక్రమాలను కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు కొనసాగిస్తామన్నారు.

C.E.O
Cell – 9866017966

