
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. శర్మ భార్య భుయాన్ శర్మకు పవన్ మూడు దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయని, అలాగే ఆమెకు విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఖేరా పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను ముఖ్యమంత్రి దాచిపెట్టారని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో పవన్ ఖేరా కొన్ని పత్రాలను ప్రదర్శించారు. రినికి భుయాన్ శర్మకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, అలాగే ఈజిప్ట్ దేశాలకు చెందిన పాస్పోర్ట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఇతర దేశాల పాస్పోర్ట్లు ఉండే అవకాశం లేదు, ఇది తీవ్రమైన నేరమని ఖేరా స్పష్టం చేయబడింది.
కేవలం పాస్పోర్ట్లే కాకుండా, దుబాయ్లో రినికి రెండు ఖరీదైన ఆస్తులు ఉన్నాయని, అమెరికాలోని వ్యోమింగ్లో ఒక కంపెనీని కూడా ఆమె చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. వీటికి సంబంధించిన హిమంత బిశ్వ శర్మ తన ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని, తప్పుడు సమాచారం ఇచ్చిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించారు.
మరోవైపు, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రదర్శించిన పత్రాలన్నీ నకిలీవని, ఫోటోషాప్ చేసిన ఆధారాలతో ప్రజలు తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని. ముఖ్యంగా ఆ పాస్పోర్ట్ పత్రాల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని, అవి చూస్తుంటేనే నకిలీవని అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ కేసుపై విచారణ, తన ప్రతిష్టను జార్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్ ఖేరాపై 48 గంటల్లో క్రిమినల్ డెఫమేషన్ (పరువు నష్టం) దావా వేయడానికి సీఎం ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రినికి భుయాన్ శర్మ కూడా స్పందించూ.. ఒక జాతీయ పార్టీ ప్రతినిధి ఇంత దిగజారి వ్యవహరిస్తున్నారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఈ ఆరోపణలు రావడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అస్సాం అస్తిత్వం గురించి మాట్లాడే కుటుంబానికి విదేశీ పాస్పోర్ట్లు ఉండటం వల్ల ఏంటని ప్రతిపక్ష నేత గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
రానున్న రోజుల్లో ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ ఆధారాలు ఇచ్చిన ప్రామాణికతపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాగే హిమంత బిశ్వ శర్మ వేయబోయే పరువు నష్టం దావా పట్ల కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

C.E.O
Cell – 9866017966

