
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ డెల్ తన ఉద్యోగులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు చెందిన పలు ఆర్థిక, సాంకేతిక సంస్థలను తమ లక్ష్యాలుగా ప్రకటించిన నేపథ్యంలో డెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మధ్య వరకు మధ్యప్రాచ్య దేశాలకు ఎటువంటి పని నిమిత్తం ప్రయాణాలు చేయకూడదని కంపెనీ తన సిబ్బందిని కోరింది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా విడుదల చేసిన జాబితాలో డెల్తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు అమెరికా, ఇజ్రాయెల్కు గూఢచారి సంస్థలుగా ఉన్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్న ఐఆర్జీసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతంలో ఈ కంపెనీల కార్యాలయాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఇప్పటికే అమెజాన్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే డెల్ తన అంతర్గత సమాచార వ్యవస్థ ద్వారా ఉద్యోగులకు పంపిన భద్రతకే తమకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చే సందేశాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్ వంటి దేశాలతో పాటు బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు తాగడం లేదు. నేరుగా వెళ్లడమే కాకుండా, ఈ దేశాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణాలను కూడా నివారించాలని ఆదేశించింది.
ప్రస్తుతం ఆయా దేశాల్లో డెల్ ఉద్యోగుల తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్క్ ఫ్రం హోం పని చేయడం జరిగింది. భౌతిక దాడులతో పాటు సైబర్ దాడులు కూడా జరిగే అవకాశం ఉన్నందున, కంపెనీకి చెందిన సెక్యూరిటీ అండ్ రెసిలియెన్సీ ఆపరేషన్స్ బృందం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు మానసిక ధైర్యాన్ని కౌన్సెలింగ్ సేవను కూడా అందుబాటులోకి తెచ్చింది.

C.E.O
Cell – 9866017966

