

రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారియే భక్షకుడిగా మారిన ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణ కన్నడ ఏర్పాటు మూడబిద్రి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సందేశ్ బి.జి., ఓ వివాహిత పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైలులో ఉన్న తన భర్తను విడిపించాలని కోరడానికి వచ్చిన మహిళను సదరు అధికారి వేధించడమే కాకుండా, విస్తుపోయే డిమాండ్లు పెట్టినట్లు సమాచారం.
రూ. 25 లక్షలు లేదా వారి కోరిక..
బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె భర్త ఒక కేసులో జైలుకు వెళ్లారు. అతడిని విడుదల చేయాలని కోరుతూ ఆమె సీఐ సందేశ్ను సంప్రదించింది. అయితే దీనికి ప్రతిఫలంగా సదరు అధికారి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. “నీ భర్త బయటకు రావాలంటే నాకు రూ. 25 లక్షలు చెల్లించాలి.. లేదంటే రాత్రి నా ఇంటికి రావాలి” అంటూ అసభ్యకరమైన ప్రతిపాదనలు చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
కేవలం ఆ మహిళనే కాకుండా, మరికొందరు మహిళల పట్ల కూడా ఈ అధికారి ఇలాగే ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ తన మాట వినకపోతే, ఆమె భర్త పేరును రౌడీ షీటర్ల జాబితాలో చేరుస్తానని కూడా బెదిరించినట్లు సూచించింది. తన పలుకుబడిని ఉపయోగించి అక్రమ కేసులు బనాయిస్తానని సందేశ్ హెచ్చరించడంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు.
రంగంలోకి మహిళా కమిషన్
ఈ వ్యవహారం వైరల్ కావడంతో కర్ణాటక రాష్ట్ర మహిళా కమీషన్ మీడియాలో తీవ్రంగా స్పందించింది. ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి, మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరమని. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్కు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన సదరు సీఐపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. బాధితులు తమ గోడును మీడియా ముందు వెల్లడించడంతో ఈ బాగోతం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సమాచారం కావాలంటే అడగగలరు.

C.E.O
Cell – 9866017966
