
వైసీపీ శ్రేణుల ఆరాధ్యుడు జగనన్న ఇప్పుడు జగన్ మావయ్యా అయ్యారు. ‘ఏప్రిల్ ఫూల్స్’ రోజున మావిగన్ అని కొత్త క్యాపిటల్ ప్రపోజ్ చేసిన మాజీ సీఎం నెటిజన్లకు అడ్డంగా బుక్ అయ్యారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా, యూట్యూబ్ ఒకటేంటి.. మొత్తం సోషల్ మీడియా వేదికల్లో జగన్ ట్రోలింగ్ పీస్ అయిపోయింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై.. ఎంత సేపూ గన్లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ తరహా ఈక్వేషన్లతో మావిగన్కు కౌంటర్గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్ని ఒక రేంజ్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
‘ఇంకా నయం.. జమ్మలమడుగులో జ, గుంటూరులో గన్ కలిపి గుంటూరు కేంద్రంగా జగన్ పేరుతో రాజధాని పెట్టలేదు.. అంటూ సెటైర్ వేశారు. జగయ్యపేట నుంచి గుంటూరు వరకు హైవే అని, ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి జగన్ అని పేరు పెట్టాలని మరొకరు సూచించారు. ఇకపై మా మచిలీపట్నం,విజయవాడ, గుంటూరు ఫ్రెండ్స్ను మావిగన్స్ అని పిలవొచ్చా? అని జగన్ పర్మిషన్ అడిగేస్తున్నారు. జెన్-జీ బ్యాచ్ పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు గూగుల్లో వెతుకుతున్నారు. వారు జగన్ను సంప్రదిస్తే చాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి.
ఆ కావలసిన మావయ్యా ఎలా వస్తాయ్ మీకే ఇలాంటి ఐడియాలు.. మరి మన మూడు రాజధానుల సంగతేం చేద్దాం అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎవరో రాసిచ్చారు సరే, ముందు ముందు స్క్రిప్ట్ చదవాలని ఉందా?.. ఈ వారం వచ్చిన కొత్త ఐడియా ఇదా? దీని కోసం బెంగళూరు నుంచి రావాలా? .. మరిన్ని ప్రెస్మీట్లు పెట్టి ప్లాన్ -సి టూ ప్లాన్-జడ్ వరకు చెప్పండంటూ చరుకలు అంటున్నాయి. ‘మేమేం పాపం చేశాం? మా జిల్లా, మా ఊరి పేరు కూడా కలిసేలా రాజధాని నామకరణం చేయండి అని పంచ్లు విసురుతున్నారు. రాష్ట్రానికి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదన్నప్పుడు మావిగన్ ఎక్కడ పెట్టుకోవాలి మాయ్యా అని తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి నెత్తింట నామకరణాల మావయ్య అలా బుక్ అయ్యారిప్పుడు.

C.E.O
Cell – 9866017966

