
నేటి చిన్న సమాజంలోచిన్న కారణాలతో భార్యాభర్తల బంధాలు బీటలు వారుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ బంధంలో ప్రేమ, అనుబంధం ఎంత గాఢమో చూపించే ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి…ఒక వ్యక్తి తనకు తన భార్య మీద ఉన్న ప్రేమను చాటి చెప్పాడు…భార్య మీద ఎనలేని ప్రేమ పెంచుకున్నాడు. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే తిరిగి భార్యతో సరదాగా గడిపేవాడు.. అంతలోనే భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె లేని జీవితం వద్దనున్నాడు. ఆమె మరణాన్ని భరించలేకపోయాడు. చివరకు తాను సూసైడ్ చేసుకుని భార్య వద్దకు చేరుకున్నాడు.. ఈ విషాదకరమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేటలో నివాసముంటున్న చంద్రశేఖర్ యాదవ్ (ఎస్సై) టూటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ఈరోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 17న ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ భార్య దివ్య కడుపునొప్పి తీవ్రతతో మనస్తాపానికి గురై గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. భార్య అకస్మాత్తుగా మృతి చెందడంతో చంద్రశేఖర్ యాదవ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, సహచరులు ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన మానసికంగా కుంగిపో యాడు.
భార్యపై అపారమైన ప్రేమతో జీవించిన ఆయన, ఆమె లేని జీవితం తట్టుకో లేక చివరకు అదే ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, సహచర పోలీసులు కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు..

C.E.O
Cell – 9866017966

