
.webp)
ఉగాది కొత్త సంవత్సరంలో వాణిజ్యం, పంటలు సమృద్ధిగా పండిత రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోష్కుమార్ తెలిపారు. రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు. ఒడిదుడుకులు ప్రత్యక్ష సీఎం రేవంత్రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కొత్త బాధ్యతలు చేపడతారని. శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతు..“ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరమని.

తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే మా లక్ష్యమని.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా అందజేస్తాం. రైతుల రుణభారం అత్యల్పంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. అందుకే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని పేర్కొన్నారు.

రైతుభరోసా కోసం ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని రేవంత్ అన్నారు. ఈ నెల 22న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నాం.రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ధరణి సమస్యలను పరిష్కరించి భూభారతి ద్వారా భూసమస్యలకు ముగింపు పలుకుతున్నామని తెలిపారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెట్టడమే మా లక్ష్యం. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

C.E.O
Cell – 9866017966
