
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై న్యాయమూర్తి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి హరీష్రావు, ఐఎస్ అధికారి స్మిత సబర్వాల్ ఘోష్ కమీషన్ నివేదిక సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అసలు కమీషన్ ఏర్పాటే చట్టబద్ధం కాదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ కేసులో హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమీషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది. కమిషన్ చట్టబద్ధతపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలపై హైకోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చేసింది. నివేదికను చెల్లుబాటు చేస్తే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. .మొత్తానికి హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది.

C.E.O
Cell – 9866017966

