
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది. విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైన మాచర్ల సీఐ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ప్రాణాలు రక్షించాల్సింది పోయి, ఆమెను మృత్యువు ఒడిలోకి నెట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
గత నెలలో యాదవ బజార్కు చెందిన చౌడేశ్వరి (22) నాగరాజు అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. రక్షణ కోరుతూ దంపతులు పోలీసులను ఆశ్రయించగా, నిబంధనలకు విరుద్ధంగా సీఐ వెంకటరమణ ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే తండ్రి చంద్ర శ్రీను ఆమెను గొంతు నులిమి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, పోస్టుమార్టం నివేదికలో అది హత్య అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ ఘటనపై ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధితురాలిని నిందితుల చేతికి చిక్కేలా చేయడం క్షమించరాని నేరం” అని మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ వ్యవహారంలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పరువు తీసేలా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నిందితుడు చంద్ర శ్రీను పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సీఐ పాత్రపై మరింత లోతైన విచారణకు పరిశోధనలు జరిగాయి. పరువు హత్యలకు ఘటనే వారికి పోలీసుల సహకారం ఉంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో మరికొంత మంది కింది స్థాయి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మాచర్ల ప్రాంతంలో పరువు హత్య వంటి దారుణ ఘటన జరిగినప్పుడు, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక సిఐపై ఉంటుంది. అయితే, వెంకటరమణ ఆ బాధ్యతను గాలికొదిలేశారు. బాధితుల పక్షాన నిలబడాల్సింది పోయి, ఆర్థిక ప్రయోజనాల కోసం నిందితులతో చేతులు కలిపారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ ఘటన దెబ్బతీసిందని, అందుకే శాఖాపరమైన చర్యలు ఇంత కఠినంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

C.E.O
Cell – 9866017966

