
మహిళల టెన్నిస్ ప్రపంచకప్గా పరిగణించే ‘బిల్లీ జీన్ కింగ్ కప్’ ఆసియా-ఓషియానియా గ్రూప్-1 పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ ప్రముఖ వహించే ఐదుగురు సభ్యులతో కూడిన జట్టును అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో తెలంగాణకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చోటు దక్కించుకోవడం విశేషం.
ఏప్రిల్ 7 నుంచి 11 వరకు న్యూఢిల్లీలోని డీఎల్టీఏ మైదానంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. భారత జట్టులో అగ్రశ్రేణి క్రీడాకారిణులు అంకిత రైనా, రుతుజా భోసలేలతో పాటు తెలంగాణ స్టార్ ప్లేయర్లు సహజ యమలపల్లి, శ్రీవల్లి రష్మిక భమిడిపాటిలకు అవకాశం దక్కింది. వీరితో పాటు వైష్ణవి అద్కర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రిజర్వ్ ప్లేయర్గా వైదేహి చౌదరిని ఎంపిక చేశారు.
తెలంగాణకు చెందిన సహజ యమలపల్లి ప్రస్తుతం భారత మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా శ్రీవల్లి రష్మిక గత ఏడాది జరిగిన ఇదే టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. గత సీజన్లో ఆడిన ఐదు సింగిల్స్ మ్యాచుల్లోనూ విజయం సాధించి, ప్రతిష్టాత్మకమైన ‘బిల్లీ జీన్ కింగ్ కప్ హార్ట్ అవార్డు’ను సైతం ఆమె దక్కించుకున్నారు.
భారత జట్టుకు కెప్టెన్గా విశాల్ ఉప్పల్, కోచ్గా రాధికా కాణిత్కర్ వ్యవహరించనున్నారు. టోర్నీకి వారం రోజుల ముందు నుంచే శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సిన ఏఐటీఏ అందిస్తుంది. ఈ టోర్నీలో భారత్తో పాటు ఇండోనేషియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, థాయ్లాండ్ మరియు మంగోలియా దేశాలు తలపడుతున్నాయి.
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే-ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. స్వదేశంలో మ్యాచ్లు జరుగుతుండటం భారత్కు కలిసివచ్చే అంశం. గత ఏడాది తృటిలో ప్లే-ఆఫ్స్ అవకాశం కోల్పోయిన భారత జట్టు, ఈసారి తెలంగాణ ప్లేయర్ల ఫామ్తో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
వరుస విజయాలతో జోరు మీదున్న సహజ, శ్రీవల్లి రాణించడంపైనే భారత్ అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తుండటం జట్టుకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో భారత మహిళలు సత్తా చాటుతూ ప్రపంచ గ్రూప్ దశకు చేరుకోవాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

C.E.O
Cell – 9866017966

