

నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దూరమవుతూ, భావోద్వేగ బలహీనతలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ బంధాలు, స్నేహాలు తగ్గిపోతున్న సమయంలో పెంపుడు జంతువులపై అధిక మమకారం పెరగడం కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్కు చెందిన హిమబిందు (20) అనే బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది.
గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చింది. ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి, కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం ఏర్పడింది. అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడం హిమబిందును తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను తట్టుకోలేక ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ ఇంట్లో ఉన్న ఎలుకల మందులు తాగి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది.
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.”
ఈ ఘటనతో మరోసారి సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం, భావోద్వేగ అస్థిరతపై చర్చ మొదలైంది. పెంపుడు జంతువులపై ప్రేమ సహజమే అయినప్పటికీ, అది మానసికంగా అతిగా ఆధారపడే స్థాయికి చేరితే ఇలాంటి దుర్ఘటనలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఎటువంటి ఘటనలు జరగలేదని నిపుణులు గుర్తించారు… కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని, భావోద్వేగపరమైన మద్దతు అందించాల్సిన అవసరం మరింతగా పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు.

C.E.O
Cell – 9866017966
