

హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్లో షాకింగ్ ఘటన జరిగింది. నేటి కాలంలో వివాహ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చినా, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు తమ పురాతన సంప్రదాయాలను ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు సోదరులు ఒకే యువతిని వివాహం చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ద్వాపర యుగంలోని ద్రౌపదీ వివాహాన్ని తలపించే ఈ ‘బహుభర్తృత్వ’ఆచారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చూస్తుంటాం, కానీ ఇక్కడ ఒక మహిళ ముగ్గురు అన్నదమ్ములను భర్తలుగా స్వీకరించింది. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ వంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఈ పద్ధతి తరతరాలుగా వస్తోంది. ఈ వివాహ వేడుక అత్యంత భక్తిశ్రద్ధలతో, స్థానిక గిరిజన రీతుల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ వింత ఆచారం వెనుక ఒక బలమైన సామాజిక మరియు ఆర్థిక కారణం దాగి ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల సాగు భూమి చాలా తక్కువగా ఉంటుంది. సోదరులు ఎవరైనా వివాహం చేసుకుంటే, భవిష్యత్తులో ఆస్తి పంపకాలు జరిగి భూమి చిన్న ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంది. కుటుంబ ఆస్తులు విడిపోకుండా ఉండటానికే సోదరులందరూ కలిసి ఒకే స్త్రీని వివాహం చేసుకుంటారు. దీనివల్ల కుటుంబం ఐక్యంగా ఉండటమే కాకుండా, ఆర్థిక వనరులు కూడా పదిలంగా ఉంటాయని వారు నమ్ముతారు.
ఈ పద్ధతిని స్థానికులు ‘పాండవ వివాహం’ అని కూడా పిలుస్తుంటారు. పాండవులు ఐదుగురు కలిసి ద్రౌపదిని వివాహం చేసుకున్న రీతిలోనే, తాము కూడా వంశాచారాన్ని గౌరవిస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ కుటుంబాల్లో జన్మించే పిల్లలు పెద్దన్నను తండ్రిగా సంబోధిస్తారు, మిగిలిన సోదరులను కూడా తండ్రి సమానులుగానే గౌరవిస్తారు.
ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఆచారాలు ఆశ్చర్యం కలిగించాయి, అక్కడ భౌగోళిక పరిస్థితులు మరియు వనరుల కొరత దృష్ట్యా ఈ పద్ధతిని వారు సమర్థించుకుంటున్నారు. చదువుతున్న యువత సైతం తమ పాత సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వివాహాలకు మొగ్గు చూపుతుండటం విశేషం. మారుతున్న కాలంతో పాటు ఇలాంటి ఆచారాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, కొన్ని కుటుంబాలు మాత్రం తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు వీటిని కొనసాగిస్తున్నాయి. ఆధునిక విద్య మరియు చట్టాల ప్రభావంతో ఈ పద్ధతులు ఎంతవరకు మనుగడ సాగిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

C.E.O
Cell – 9866017966
