Home Latest News యూఏఈ గ్యాస్ ఫీల్డ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి…నిలిచిపోయిన గ్యాస్ ఉత్పత్తి | UAE షా గ్యాస్ ఫీల్డ్| ఇరాన్ డ్రోన్ దాడి| మిడిల్ ఈస్ట్ ఎనర్జీ క్రైసిస్| అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ – Jananethram News

యూఏఈ గ్యాస్ ఫీల్డ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి…నిలిచిపోయిన గ్యాస్ ఉత్పత్తి | UAE షా గ్యాస్ ఫీల్డ్| ఇరాన్ డ్రోన్ దాడి| మిడిల్ ఈస్ట్ ఎనర్జీ క్రైసిస్| అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చేరుకున్న సందర్బంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని కీలకమైన ఇంధన వనరులపై దాడులు మొదలయ్యాయి. అబుదాబి పశ్చిమకి దిశలో ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రముఖ ‘షా గ్యాస్ ఫీల్డ్’ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగడంతో అధికారులు గ్యాస్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేశారు.

సోమవారం జరిగిన ఈ డ్రోన్ దాడిలో గ్యాస్ నిల్వలు ప్రధాన లక్ష్యంగా మారాయి. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో ప్లాంట్‌లోని ఒక మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన అబుదాబి అత్యవసర సేవా విభాగాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే నష్టాన్ని అంచనా వేయడానికి మరియు భద్రతా తనిఖీల కోసం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం ధృవీకరించింది.

ఈ షా గ్యాస్ ప్రాజెక్టును అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మరియు అమెరికాకు చెందిన ఆక్సిడెంటల్ పెట్రోలియం సంయుక్తంగా ఉత్పత్తి చేస్తుంది. దేశం మొత్తం అవసరమయ్యే గ్యాస్‌లో దాదాపు ఐదో వంతు (20 శాతం) ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఇంతటి కీలకమైన కేంద్రంపై దాడి జరగడం యూఏఈ ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసింది. గత వారం రోజులుగా ఇరాన్ మరియు దాని అనుబంధ సంస్థలు గల్ఫ్ దేశాలలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇప్పటికే రువైస్ రిఫైనరీ వద్ద కూడా ఇటువంటి డ్రోన్ దాడి జరగడంతో అక్కడ కూడా ముందస్తు జాగ్రత్తగా కార్యకలాపాలు నిలిపివేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్, జపాన్ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మరియు ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించడానికి అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు, ఈ దాడుల వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తమ మౌలిక సదుపాయాల రక్షణకు కట్టుబడి ఉన్నామని యూఏఈ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి దాడులను అడ్డుకునేందుకు వైమానిక రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird