
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. యూపీకి చెందిన పవన్, సాయి అనే ఇద్దరు యువకులు హైదరాబాద్కు వచ్చి షాద్నగర్ సమీపంలోని ఎలికట్ట గ్రామ శివారులో ఉన్న విజయ నేహా పరిశ్రమలో పని చేస్తూ, ఒకే చోట స్థాపించారు. ఆదివారం సాయంత్రం పనివేళల్లో సరదాగా ఆటపాటలు జరుగుతున్న సమయంలో, పరిశ్రమలో ఉపయోగించే ఎయిర్ పైప్ను సాయి అనే వ్యక్తి..పవన్ మలద్వారంలో పెట్టడంతో పవన్ గిలగిలాడుతూ కుప్పకూలి కింద పడిపోయాడు.
సాయి చేసిన ప్రమాదకరమైన చర్య విషాదానికి దారి తీసింది. సరదాగా చేసిన ఈ చర్య వల్ల పవన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై పవన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన షాద్నగర్ పోలీసులు, నిందితుడు సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై సీఐ సీతారాం వివరాలు.

C.E.O
Cell – 9866017966
.webp)
