
ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వంలో ఎం పవన్ కుమార్ సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సుగ్రీవ”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. “సుగ్రీవ ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, వాళ్ళు ఆ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్ పవన్ కుమార్ గారు ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. ఐ తో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి 24 న విడుదలకు సిద్ధంగా ఉంది” అని అన్నారు.
సాయి కృప, సుమన్ శెట్టి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విజయ్, గగన గీతిక, అల్పురి సునీల్, వంశీ కోడలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ పట్నాయక్, విజయ్ కూరాకుల సంగీతం అందించారు.

