[ad_1]
అల్వాల్ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న అంజు అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు... పెద్ద కుమార్తెలకు పెళ్లే అత్తారింటికి వెళ్లిపోయింది... చిన్న కూతురు ఇషిక, తల్లి అంజుతో కలిసి నివాసం ఉంటున్నది.. ఏం జరిగిందో తెలియదు కానీ సంవత్సరం నుంచి తల్లి మిస్సింగ్ అయింది... అయితే తన తల్లి కనిపించిన కూతురు పెద్దగా కనిపించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ఘటన ప్రాంతం నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మొత్తం సీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అయినా కూడా అంజు ఆచూకీ లభ్యం కాలేదు... దీంతో పోలీసులు ఈ కేసును నిర్లక్ష్యం చేశారు.
అయితే తాజాగా తల్లి అంజు పేరుతో ఉన్న వాహనాన్ని అమ్మేందుకు చిన్న కూతురు, ఆమె ప్రియుడు తీసుకెళ్లిన సమయంలో అనుమానస్పద పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలు చేసిన వ్యక్తికి వాహనం ఇచ్చిన సమాధానాలు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు... దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించి విస్తు పోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి... దీంతో పోలీసులు క్లూస్ టీం సహాయంతో అంజు ఇంటికి తవ్వకాలు... వివరాల్లోకి వెళితే...
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూతురు అంజు అనే మహిళ తన చిన్నితో నివాసం ఉంటుంది... పెద్ద కూతురికి పెళ్లి... చిన్న కూతురు గాలి తిరుగుళ్ళు తిరుగుతుంది.. ప్రతిరోజు ఒక ప్రియుడ్ని ఇంటికి తీసుకురావడం అతనితో ఎంజాయ్ చేయడం చిన్న కూతురు ఇషికాకు పరిపాటి అయింది.
ఇది తల్లి అంజుకి నచ్చేది కాదు. దీనితో తల్లి, కూతుర్ల మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉండేది... గత ఏడాది కూడా ఓ ప్రియుడిని తీసుకొని ఇంటికి వచ్చిన చిన్న కూతురు ఇషిక అతనితో సరదాగా గడుపుతుండగా... తల్లి అంజుకి కోపం వచ్చి కూతురి పై అరిచింది... ఆగ్రహానికి లోనైన చిన్న కూతురు ఇషిక మరియు ఆమె ప్రియుడు హఠాత్తుగా తల్లి అంజు పై దాడి చేసి హత్య చేశారు. ఎవ్వరు కూడా గుర్తుపట్టకుండా ఉండేందుకు దానిపై టైల్స్ కూడా వేశారు.... తల్లి కనిపించడం లేదని పెద్ద కూతురు జవహర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ సంవత్సరం క్రితమే తల్లిని హత్య చేసిన చిన్న కూతురు తన తల్లి కనిపించడం లేదంటూ రకరకాల స్టోరీలు చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించింది. దీంతో పోలీసులు ఈ కేసును నిర్లక్ష్యం చేశారు. అయితే తాజాగా తన తల్లి అంజుకు సంబంధించిన వాహనాన్ని అమ్మేందుకు చిన్న కూతురు ఆమె ప్రియుడు వెళ్లిన సమయంలో అనుమానస్పద పరిస్థితులు ఏర్పడ్డాయి. వాహనం కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తి ఈ ప్రశ్నలకు ఇద్దరు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతనికి ఎందుకో అనుమానం వచ్చింది. సదరు వ్యక్తి వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తు రంగంలోకి దిగిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో పోలీసులు, క్లూస్ టీం రంగంలోకి దిగి అంజు ఇంటికి తవ్వకాలు మొదలుపెట్టారు .ఇంట్లో తవ్వకాలు జరపగా మట్టిలో పాతిపెట్టిన మృతదేహం కనిపించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు... మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్కి తరలించనున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి నిజాలు పోస్టుమార్టం రిపోర్టు మరియు ఫారెన్సీ దర్యాప్తు తర్వాత బయటపడుతున్నాయి... ఈ ఘటనపై నివేదిక కూడా కోరినట్లు సమాచారం..
[ad_2]