[ad_1]
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు కోయంబత్తూర్ నుంచి వైజాగ్కు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి భారీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూర్ నుంచి బయలుదేరిన ఒక ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ సమయంలో విమానం మారాల్సి ఉంది. ఈ విధంగా అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని ఆపి... అతని బ్యాగ్ను తనిఖీ చేయగా, అందులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న భారీ మొత్తంలో బంగారం కనిపించింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అతని వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.1 కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుని అరెస్టు చేశారు.ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా? బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి అందించాల్సి ఉంది? అనే కోణాల్లో అధికారులు కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఇలాంటి ఘటనలను అడ్డుకుంటున్నారని అధికారులు తెలిపారు.
[ad_2]