[ad_1]
అతిథి దేవోభవ అన్న మాటకు కాలం చెల్లిందా? పిలిచినా పిలవకున్నా వచ్చిన వారికి అన్నంపెట్టి ఆదరించే లక్షణం ఇక ఔట్ డేటెడ్ అయిపోయిందా? అంటే ఔననే అంటారు.. భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూస్తే. గతంలో ఎన్నడూ చూడని విధంగా పిలవని పేరంటానికి రాకండి అంటూ ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిలవని ఫంక్షన్కు వెళ్లి భోజనం చేస్తే భారత శిక్షాస్మృతి ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న హెచ్చరిక కూడా ఆ ఫెక్సీలో ఉంది. భారత సంస్కృతిలో ఆకలితో ఉన్నవారికి పెట్టడం పుణ్యం. అలాగని పిలవని పేరంటానికి వెళ్లి పెళ్లి భోజనం చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం.
ఫంక్షన్ హాల్స్లో ప్లేట్ల లెక్కన క్యాటరింగ్కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
దీనితో పిలువని వ్యక్తులు ఫంక్షన్కు వెళ్లి ఆ ఫంక్షన్ వారికి ఆర్థిక భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇండయన్ పీనల్ కోడ్లో సెక్షన్ 441ను పొందారు. ఆ సెక్షన్ ప్రకారం ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తి ఆ ఫంక్షన్కు వచ్చి పట్టుబడితే, 3 నెలల జైలుశిక్ష, ఐదు వేల రూపాయల వరకు విధించే అవకాశం ఉంది.
అయితే ఈ విషయం, ఈ సెక్షన్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. తాజాగా భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఈ సెక్షన్ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
[ad_2]