[ad_1]
-సుప్రీం తీర్పుతో సినిమా వాళ్ళల్లో సంబరాలు
-తెలంగాణ హైకోర్టుకి షాక్
-తీర్పులో ఏమని చెప్పింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)ఉగాది కానుకగా ఈ నెల 18న బెనిఫిట్ షో నుండి సందడి చేయనున్న విషయం తెలిసిందే. దీనితో అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. పైగా వరుస ప్రమోషన్స్ తో మూవీపై రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న రిలీజైన మూడో సాంగ్ నే దానికి ఉదాహరణ. కానీ వాళ్లందరిలో మాత్రం ఒక్క దిగులు ఆవహించి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏరియా అభిమానుల్లో. ఇప్పుడు ఆ దిగులు సుప్రీం కోర్టు తీర్పుతో ఎటు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకునే వీలు కలిపిస్తూ తెలంగాణ(తెలంగాణ)ప్రభుత్వం రెండు రోజుల ముందు జీవో కొత్త జారీ చెయ్యడం, లేదా చివరి నిమిషంలోనో జారీ చేయడమో జరుగుతుంది. ఆ వెంటనే ఒకరు కోర్టులో టికెట్ పెంపుపై కేసు వేస్తున్నారు. దీంతో అభిమానుల్లో, మూవీ లవర్స్ లో టెన్షన్ స్టార్ట్. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టికెట్ ధరలని పెంచుతూ నిర్ణయం తీసుకుంటే ఆ వివరాల విడుదల కి 90 రోజుల ముందే బహిర్గతం చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అభిమానుల్లో,సినీ మేకర్స్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది.
హైకోర్టు తీరుపై అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(మైత్రి మూవీ మేకర్స్)సుప్రీం కోర్టు(సుప్రీం కోర్ట్)ని ఆశ్రయించింది. ఈ నిబంధన వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుంది. రిలీజ్ డేట్స్ చివరి నిమిషంలో మారుతుంటాయి. అలాంటప్పుడు 3 నెలల ముందే ధరల వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని మైత్రి తరుపు లాయర్ వాదించాడు. ఈ నిబంధన వల్ల చిత్ర పరిశ్రమ స్తంభించిపోయే ప్రమాదం ఉందనే వ్యాఖ్య కూడా సుప్రీంకోర్టు చేసింది.
కూడా చదవండి: Priyanka mohan: ఓజి ప్రియాంక మోహన్ ఆవేదన.. డబ్బులు ఎందుకు ఇచ్చారు
ఇంతకు ముందు ఇలాగే రిలీజ్ కి కొద్ది రోజుల ముందు టికెట్ రేట్స్ పెంపు కోసం ప్రభుత్వ అనుమతులు పొందే అవకాశం నిర్మాతలకి కలిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ ని మైత్రి మూవీ మేకర్స్ పవన్ కెరీర్ లోనే భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే.
[ad_2]