Home Latest News మావోయిస్టు గణపతి లొంగుబాటుపై ఢిల్లీలో ప్రచారం! | లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి| సీపీఐ మావోయిస్టు| ఆపరేషన్ కాగర్| నేపాల్| తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం| ముప్పాల లక్ష్మణరావు| బీర్పూర్| నక్సలైట్ ఉద్యమం| రైతాంగ పోరాటం| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి| సివి ఆనంద్| హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ – Jananethram News

మావోయిస్టు గణపతి లొంగుబాటుపై ఢిల్లీలో ప్రచారం! | లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి| సీపీఐ మావోయిస్టు| ఆపరేషన్ కాగర్| నేపాల్| తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం| ముప్పాల లక్ష్మణరావు| బీర్పూర్| నక్సలైట్ ఉద్యమం| రైతాంగ పోరాటం| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి| సివి ఆనంద్| హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


దేశంలో దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన సీపీఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలో లొంగిపోవచ్చనే వార్తలు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోం అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోవచ్చననే మంత్రి ఢిల్లీలో జోరుగా సాగుతోంది. దాదాపు 50 ఏళ్ల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన గణపతి, ఇటీవల అజ్ఞాతంలో ఉన్న సమాచారం. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కాగర్ తరువాత ఆయన నేపాల్‌లో ఆశ్రయం పొందినట్లు ప్రచారం జరిగింది.

అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారన్న వార్తలతో ఆయన లొంగుబాటు అంశం మరింత వేడెక్కింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా గణపతి సాధారణ జీవితం గడపాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యం లోనే గణపతి తెలంగాణ పోలీసులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబు తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఆయన ఉద్యమ జీవితానికి ముగింపు పలికి సాధారణ జీవితం గడపాలని కోరు తున్నట్లు చెపుతున్న సమాచారం. ఈ విధంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం గణపతితో సంప్రదింపులు జరుపుతున్నట్లు.

గణపతి లొంగుబాటు జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశముంది. అగ్ర నాయ కుల యుగానికి ముగింపు పలికే పరిణామంగా ఇది నిలుస్తోంది. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్‌లో జన్మించిన గణపతి, అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. ఉద్యమంలో ఆయనను సహచరులు “టీచర్” అని పిలిచేవారు. 1970 దశకం లో జగిత్యాల ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటాల ద్వారా గణపతి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా సాగుతుంది. ఆ తరువాత కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి నాయ కుడిగా ఎదిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

2018లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఆయన వైదొలి గారు. అయితే మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతి పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఆయన పర్యవేక్షణలో దేశంలో పలు సంచలన దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గణపతి భార్య సుజాత కూడా ఉద్యమంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. గణపతి స్వస్థలం ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల పరిధిలోని ప్రాంతంగా గుర్తించబడింది. ఇక గణపతి లొంగుబాటుపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. అయితే ఈ వార్తలపై ఆసక్తి ఉంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird