Home సినిమా ఎన్టీఆర్ పై అనసూయ పోస్ట్… 1గా నిలుస్తుందా! – Jananethram News

ఎన్టీఆర్ పై అనసూయ పోస్ట్… 1గా నిలుస్తుందా! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-ఇటీవల బెంగుళూరు వెళ్లిన ఎన్టీఆర్
-స్పీచ్ వైరల్
-అనసూయ చెప్పేది ఏంటి!

సినీ సర్కిల్స్ ఏంటి.. చాయ్,కాఫీల అడ్డా ఏంటి..సోషల్ మీడియా ఏంటి. ఇలా అన్ని చోట్ల మాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్'(Ntr)నామస్మరణ లేని రోజంటూ ఉండదు. రెండున్నర దశాబ్దాల ఎన్టీఆర్ సినీ జర్నీకి, హిస్టరీ కి దక్కిన గౌరవం అది. రీసెంట్ గా ఎన్టీఆర్ బెంగళూరులో జరిగిన ‘కిమ్స్’ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఎక్కడ అడుగుపెట్టినా అభిమానం, జన సందడితో సంచలనం నమోదు అవుతుంది కాబట్టి కిమ్స్ ప్రాంగణం కూడా ఆ అదృష్ట వాతావరణానికి వేదిక అయ్యింది. దీనితో ఆ లోకెట్ లో లేని ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనుభూతి. ఇక ఆ సభలో ఎన్టీఆర్ మహిళా గౌరవం గురించి మాట్లాడాడు. మాటలపై ప్రముఖ నటి అనసూయ స్పందన ఎలా ఉందో చూద్దాం.

ఎన్టీఆర్ కిమ్స్ హాస్పిటల్ ని సందర్శించిన ఆదివారం మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతు ‘ఆడవాళ్లని గౌరవించే పద్ధతిలో తాను తన పిల్లలను పెంచుతున్నాను. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో నిరంతరం చర్చిస్తాను. తండ్రి ప్రవర్తనని చూస్తే పిల్లలు నేర్చుకుంటారని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మాటలపై సోషల్ మీడియా వేదికగా అనసూయ మాట్లాడుతూ ‘ఒక పెద్ద హీరో అయి ఉండి పిల్లల పెంపకం మరియు మహిళల గౌరవం గురించి చాలా బాధ్యతగా మాట్లాడటం నిజంగా అభినందనీయమని కొనియాడారు.

ఇక ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా “సీఎం సీఎం” అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, ఎన్టీఆర్ ఈ సందర్భాన్ని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ ఘటన తనకు ఎన్నో విషయాలు నేర్పించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సందర్భం లేకుండా ఇలాంటి నినాదాలు చేసి వివాదాలను సృష్టించకూడదని కూడా అభిమానులకి సున్నితంగా హితవు పలికారు. ఇక ఎన్టీఆర్ లుక్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా గెటప్పేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

అలాగే చదవండి: బాలకృష్ణ: బాలకృష్ణ పై తారకరత్న వైఫ్ అలేఖ్య వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి

ప్రస్తుతం డ్రాగన్ కోసం రామోజీ ఫిలిం సిటీలో మూడు భారీ సెట్లు వేశారని, అక్కడ 40 రోజుల పాటు సుదీర్ఘమైన షూటింగ్ జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాంతార సృష్టికర్త రిషబ్ శెట్టి(రిషబ్ శెట్టి)సైతం మాట్లాడుతు డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులని సృష్టించబోతోందని వెల్లడి చేసాడు. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలు మరియు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(తెలుగు వన్ సినిమా)యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఎవరు ఇవ్వని లేటెస్ట్ సినీ అప్ డేట్స్ మా సొంతం. కింద ఉన్న పూర్తి వీడియో కూడా చూసి లైక్ కొట్టడం మార్చుపోకండి.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird