[ad_1]
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలతో భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయి అల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దుబాయ్లో చిక్కుకొన్న వారికి సహాయం చేయడానికి భారత సంతతి వ్యాపారవేత్త యోగేశ్ దోషి ముందుకు వచ్చారు. 64 నివాసాలు ఉన్న తన అపార్ట్మెంట్లో వసతి కల్పిస్తున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఘర్షణల కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో యూఏఈ నుంచి స్వదేశానికి రావాల్సిన భారతీయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తనవంతు సహాయం చేయడానికి అల్ మిజన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్ దోషి భావించారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ, దుబాయ్లోని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన అపార్ట్మెంట్లో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 125 మందికి ఉచితంగా వసతి కల్పించారు. వారికి ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. తాము ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లలో ఉండేందుకు గడువు ముగిసిందని, పొడిగింపు వీలుకాదు కానీ క్లిష్ట సమయంలో తమకు ఈ సహాయం అందిందని పలువురు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.
యోగేశ్తో పాటు ఆ దేశంలో స్థిరపడిన అనేక భారత సంతతి వ్యక్తులు ఈ ఉద్రిక్త సమయంలో తమ స్నేహహస్తం అందించారు. దుబాయ్కు కొన్ని దూరంలో ఉన్న అజ్మన్లో వ్యాపారవేత్త ధీరజ్జైన్ ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. స్వదేశానికి వెళ్లలేనివారి కోసం వెంటనే తన ఫామ్హౌస్లో తాత్కాలిక వసతి కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా ఈ ఆఫర్లు అందిస్తారు. వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని ఈ సిబ్బంది వద్దకు తీసుకురావడానికి రోల్స్ రాయిస్ సహా 11 కార్లను నడుపుతుండటం విశేషం.
[ad_2]