[ad_1]
టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆ లిస్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేరుతున్నాడు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. (బెల్లంకొండ శ్రీనివాస్)
ఆదివారం (మార్చి 8) బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్కు చెందిన కావ్యా రెడ్డి అనే యువతితో సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు.. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.
సాయి శ్రీనివాస్-కావ్య నిశ్చితార్థ వేడుకను పెద్ద ఎత్తున కాకుండా ప్రైవేట్గా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ హాజరైనట్లు ఉన్నారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త మీనన్ సహా పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు.
2014లో వచ్చిన 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. తర్వాత 'జయ జానకి నాయక', 'రాక్షసుడు', 'కిష్కింధపురి' చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'టైసన్ నాయుడు', 'హైందవ' వంటి ప్రాజెక్టులతో ప్రస్తుతం ఉన్నాడు.
[ad_2]