
తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40° డిగ్రీలు దాటుతున్నాయి.ఈ వాతావరణశాఖ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. మిగత అన్ని జిల్లాల్లో 36° నుండి 40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఐఎండీ సూచించింది.
హైదరాబాద్లో ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత ఎప్పుడూ లేనంతగా మార్చిలో పూర్తి స్థాయిలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్కు, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

C.E.O
Cell – 9866017966

