
మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్మెంట్ మెంట్ )విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం (మార్చి 5) అసెంబ్లీలో ఆవిష్కరించారు.
ఇందులో భాగంగానే మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందించబడింది. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు ఇవ్వడానికి యోచన కార్యక్రమం. ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగానే వృద్ధుల జనాభా పెరిగి, యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని చంద్రబాబు అన్నారు.
గతంలో కుటుంబ నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా సంరక్షణ విధానానికి మారుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చెప్పారు.

C.E.O
Cell – 9866017966
.webp)
