
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి. ఆయన కుమారుడు వివాహం ఈరోజు ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణితో కలిసి నటించారు. లోకేశ్ దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేశ్ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లి మహోత్సవానికి ఐసీసీ చైర్మన్ జైషా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

C.E.O
Cell – 9866017966
.webp)
