*నిత్యం కాలేజ్ విద్యార్థులు తిరుగుతూ ఉంటారు
*జననేత్రం న్యూస్ గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ప్రతినిధి జులై07*//:గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు బాస్ రేగడిలో, బాసు రేగడి నుండి గండి మైసమ్మ కు వెళ్లే ప్రధాన రహదారిలో మెగా ఇంజనీర్ కంపెనీకి వెళ్లి 11 కెవి స్తంభం రోడ్డుపైకి వంగి ఉండడంతో, ఏ క్షణాన కింద పడుతుందో నన్న భయంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వెళ్తున్నారని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ అన్నారు,
మున్సిపల్ అధికారులు కమిషనర్ చొరవ తీసుకొని, ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ AE గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఒక సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నట్లు ఉన్న భానుచందర్ తెలిపారు.
ఈ రోడ్డు వైపు MLR, మరియు Hitham కాలేజ్ విద్యార్థులు అనునిత్యం అటు ఇటు తిరుగుతూ ఉంటారు, దయచేసి విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించగలరని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.



C.E.O
Cell – 9866017966
