*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్13*//:ఖమ్మం గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం మరో ముందడుగు వేసింది . రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 కాట్రగడ్డ శరత్ చౌదరి చేతుల మీదగా డైగ్నోస్టిక్స్ & డాక్టర్స్ కన్సల్టెన్సీ సర్వీస్ ను ప్రారంభించడం సంతోషకరమైన విషయం అన్నారు . దీనికి ఆర్ సి అఫ్ అభ్యుదయ హైదరాబాద్ ప్రసిడెంట్ కె.రాజేష్ కుమార్ , జైమ్మకో” ( ఏ యూనిట్ అఫ్ సి కె బిర్లా గ్రూప్ ఏ జి ఎం ఎస్ ఎస్ కె సర్దార్ , ఎస్ సురేష్ బాబు వారి ఆర్థిక సహాయ చేశారని పేర్కొన్నారు . అలాగే శ్రీమతి అపర్ణ సంతోష్ తల్లాప్రగడ రోటరీ ట్రస్ట్ కి లక్ష రూపాయలు డొనేషన్ చేశారని ఎన్ సింధు ఆద్య ఓవరలాండ్ పార్క్ , కాన్సస్ యూఎస్ఏ లు ఉన్నారని పేర్కొన్నారు . పేద ప్రజలు , విశ్రాంత ఉద్యోగులు అట్టి సేవలను సద్వినియోగము చేసుకొని వైద్య పరముగా తమ యొక్క ఆర్ధిక భారమును తగ్గించుకొనవలసినదిగా రోటరీ ట్రస్ట్ చైర్మెన్ & రోటరీ జిల్లా మాజీ గవర్నర్ మల్లాది వాసుదేవ్ , కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు , కో- ఆర్డినేటర్ పసుమర్తి రంగారావు , ఖమ్మం రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లమోతు రవీంద్రనాథ్ , కార్యదర్శి హరి శ్రీనివాస్ , అసిస్టెంట్ గవర్నర్ పలివెల భూషణ్ రావు తదితరులు తెలియజేశారు .






C.E.O
Cell – 9866017966
