జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఫిబ్రవరి23//:నల్గొండ జిల్లా వాసులకు శాపంగా మారింది.
40 సంవత్సరాల నాడే శ్రీశైలం ఎడమ గట్టు కాలువను నిర్మించాలని అనుకున్నారు కానీ 2005లో నిధుల మంజూరుతో 2010 నాటికి SLBC పనులను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించాలని హైదరాబాదు నగరానికి తాగునీరు ఇవ్వాలని పనులను మొదలుపెట్టారు. ఆ పనులు నేటి వరకు నత్తనడక నడుస్తూ నాణ్యత లోపంతో నిర్మాణ పనులు, నిధులు కొరతతో. ఇంజనీరింగ్ లోపాలతో నీటికి పూర్తి కాలేదు.
పనులు జరుగుతుండగానే పైకప్పు కూలిపోయి కొంతమంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో పడిపోయారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని వెంటనే కార్మికుల ప్రాణాలు కాపాడే విధంగా రెస్క్యూ టీములతో పని చేయించాలని ఇప్పటివరకు కాంట్రాక్టర్కు ఆరుసార్లు పని కాలాన్ని పొడిగించి వచ్చే జూన్ 2026 నాటికి సమయం ఇచ్చారని ఆ సమయానికైనా SLBC పనులు పూర్తి చేసి ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండ జిల్లాకు సాగు, త్రాగునీరు ఇవ్వాలని హైదరాబాద్ మహానగరానికి త్రాగునీరు ఇవ్వాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు..


C.E.O
Cell – 9866017966
