
పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న గాలిలోని కర్బన ఉద్గారాలనే ఇంధనంగా మార్చే అద్భుత ప్రక్రియను చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ ‘కార్బనాలజీ’ ప్రపంచానికి పరిచయం చేసింది. వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి, దానిని అత్యాధునిక సాంకేతికత ద్వారా ‘సింథటిక్ పెట్రోల్’గా మార్చడంలో తాము విజయం సాధించామని ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఇదొక కీలక అడుగుగా నిర్ధారించిన నిపుణులు.
ఈ ప్రక్రియలో భాగంగా, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ విధానం ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను వేరు చేస్తారు. అనంతరం పునరుత్పాదక ఇంధన వనరుల సహాయంతో హైడ్రోజన్ను కలిపి, రసాయన చర్యల ద్వారా ద్రవ రూపంలో ఇంధనాన్ని తయారు చేస్తారు. ఈ సింథటిక్ సాధారణ పెట్రోల్ పెట్రోల్ లాగే పనిచేస్తుందని, దీనిని వాడటం వల్ల వాహనాల్లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కలుగు కార్బనాలజీ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పద్ధతి ద్వారా అటు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఇటు ఇంధన అవసరాలను తీర్చుకునే వీలు కలుగుతుంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్యానికి ఈ ఆవిష్కరణ ఎంతో దోహదపడుతుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ సింథటిక్ ఇంధనాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడంలో ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా తయారీ ఖర్చు అధికంగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. భవిష్యత్తులో సాంకేతికత మరింత అందుబాటులోకి వస్తే, ఈ పెట్రోల్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే వాణిజ్య పరంగా ఈ ప్రాజెక్టును మరింత విస్తరించాలని సంస్థ కార్బనాలజీ యోచిస్తోంది.

C.E.O
Cell – 9866017966
.webp)
