
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇకపై ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అనుమతిని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదస్పద పాఠ్యాంశాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినోతో పాటు టెక్స్ట్బుక్ డెవలప్మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లు రూపొందించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
“ప్రొఫెసర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లకు భారత న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేకపోయింది. లేకపోతే విద్యార్థుల ముందు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరించండి” అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిధులతో పూర్తిగా లేదా పాక్షికంగా సంబంధమున్న ఏ బాధ్యతలను వారికి అప్పగించకూడదని కూడా ఆదేశించింది.
న్యాయవ్యవస్థ విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ, పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కనీసం ఒక్క న్యాయ నిపుణుడికీ అవకాశం ఇవ్వకపోవడం అసంతృప్తికరమని ధర్మాసనం ప్రకటించింది. ఎన్సీఐఆర్టీఈ లీగల్ స్టడీస్కు సంబంధించిన పాఠ్యప్రణాళిక రూపకల్పన వారం రోజుల్లో న్యాయ రంగానికి చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విద్యా కమిటీలో మాజీ సీనియర్ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది, అలాగే ఒకరు ఉండాలని సూచించారు.
వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీతో సంబంధం ఉన్నవారైతే మరింత సమగ్రంగా అంశాలను చేర్చే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. వివాదస్పద ఎన్సీఆర్టీఈ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సామాజిక మాధ్యమ వేదికలు, వ్యక్తుల వివరాలు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

C.E.O
Cell – 9866017966
.webp)
