
గల్ఫ్ శాఖ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతుల ఆందోళన అవసరం లేదని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మీడియా కథనాలు, వదంతుల కారణంగా కొందరు రైతుల్లో భయం నెలకొన్నప్పటికీ పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దని ఆయన సూచించారు. ముందస్తు హార్వెస్టింగ్ వల్ల మార్కెట్లో ఒక్కసారిగా సరఫరా పెరిగి రొయ్యల ధరలు పడిపోయే ప్రమాదం ఉందని.
భారతదేశం నుండి జరిగే సముద్ర ఆహారం ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3–4 శాతం మాత్రమేనని మంత్రి తెలిపారు. యూరప్, అమెరికా, జపాన్, చైనా వంటి ప్రధాన మార్కెట్లకు సముద్ర మార్గాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అందువల్ల ప్రస్తుత గల్ఫ్ పరిస్థితులు భారత సముద్ర ఆహార ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు.
అమెరికా మార్కెట్లో కూడా త్వరలో డిమాండ్ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇతర దేశాలకు మార్గం యూనియన్, అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార నియంత్రణలు రెడ్ సీ సూజ్ కాలువ మార్గం, కేప్ గుడ్ ఆఫ్ హోప్ మార్గం, చైనా సముద్ర ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. భారతీయ రొయ్యలపై ఉన్న టారిఫ్లు ఇతర పోటీ దేశాలతో సమానంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పోటీ సామర్థ్యం కొనసాగుతుందని వివరించారు.
ఇక షిప్పింగ్ కంట్రీల కొరత ఉందన్న ప్రచారం కూడా అసత్యమని మంత్రి ఖండించారు. ఎగుమతులు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. రైతుల వదంతులను నమ్మకుండా శాస్త్రీయ విధానంలో ఆక్వాకల్చర్ కొనసాగించాలని, కల్చర్ సైకిల్ పూర్తయ్యాకే హార్వెస్టింగ్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

C.E.O
Cell – 9866017966

