
భారత్ క్రికెట్లో జమ్ముకశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల సుదర్ఘీ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్ముకశ్మీర్ జయకేతనం ఎగురవేస్తూ.. నయా ఛాంపియన్ గా అవతరించింది.
దీంతో దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది జమ్ముకశ్మీర్ టీం. 1959-60 సీజన్లో తొలిసారిగా జమ్ముకశ్మీర్ రంజీ ట్రోఫీలో ఆడింది. అప్పటి నుంచి టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు 67 ఏళ్ల తర్వాత ఆ టీమ్ కల నెరవేరినట్టైంది. ఇవాళ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో తొలిసారిగా రంజీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

C.E.O
Cell – 9866017966

